– సింగరేణి కార్మికులను కోరిన మణిరామ్ సింగ్
ఇదే నిజం, బెల్లంపల్లి: సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టీఎన్టీవీసీ జనరల్ సెక్రటరీ మనీ రామ్ సింగ్ కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టీఎన్ టీవీసీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎన్టీయూసీ పోటీలో ఉంటుందని తెలిపారు. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో 35 వేల ఉద్యోగాలకు భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. అలాగే లాభాల వాటా పది శాతాన్ని కూడా మొదలు పెట్టారని, గతంలో ఉన్న నాయకులు ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం, కొత్త బొగ్గు బావులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి హామీలు నెరవేర్చలేదని మరి ఇవన్నీ నెరవేరాలంటే 27న జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం మోటార్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సింగరేణి కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు బొల్లు మల్లయ్య, పట్టణ అధ్యక్షుడు గజ్జెల నారాయణ తదితరులు పాల్గొన్నారు.