ఇదే నిజం,గొల్లపల్లి : గొల్లపల్లి ఎస్సై సతీష్ మల్లన్న పేట గ్రామంలో గ్రామ ప్రజలతో మీటింగ్ నిర్వహించి ఇటీవల అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు గురించి వివరించాడు. అదేవిధంగా సైబర్ నేరాలు, గంజాయి వలన కలుగు అనర్ధాలు, డయల్ 100 మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువత,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.