ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై ప్రజా సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి బుద్ధ నాయక్ పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, సింగిల్ విండో పరిధిలోగల రైతులు విచ్చేశారు. రైతుల నుండి రైతు భరోసా పథకంపై ప్రజా సేకరణలో, భరోసా అభిప్రాయ సేకరణలో రైతులంతా ఐదు ఎకరాల లోపు రైతులకు సాగులో ఉన్న వాటికి బోనస్ ఇవ్వాలని, ప్రతి ఎకరానికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని, సేకరణలో రైతులంతా మెజారిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, వ్యవసాయ అధికారి వెంకటేష్, ఏఇఓ సౌమ్య, సింగిల్ విండో పాలకవర్గ సభ్యులు సతీష్ చందర్రావు, మాధవరావు, గన్నె నర్సింలు, కుర్ర కీర్తన, శ్రీనివాస్, మాజీ సర్పంచులు, కలకొండ కిషన్ రావు, సకలి రమేష్, వేణు, ఎంపిటిసి బాలకిషన్, రైతులు తలారి, నర్సింలు, నాంపల్లి రమేష్, భూమరాజు, గీస శంకర్, రాజనర్స్, గ్రామాల రైతులు పాల్గొన్నారు.