న్యూఢిల్లీః నరేంద్రమోడీ పాలనలో దేశంలో జీడీపీ రికార్డు స్థాయిలో పడిపోయిందని రాహుల్గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. 45 ఏండ్లలో 45 ఏళ్లలో ఎన్నడూలేనంత ఎక్కువ స్థాయికి నిరుద్యోగం పెరిగిందని, సుమారు 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు చెప్పారు. రాష్ట్రాలకు జీఎస్టీ కింద వచ్చే వాటాను కేంద్రం ఇవ్వకుండా రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి తోస్తుందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భారత్లో కరోనా వైరస్ కేసులు, మరణాలు సంభవించేందుకు మోడీ విధానాలే కారణమని విమర్శించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఆక్రమణలు మోడీ హయంలో పెరిగినట్లు రాహుల్ అన్నారు. దేశంలో విధ్వంసాలకు మోడీ ప్రయోజిత విధానాలే కారణమని ఆరోపించారు.