హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ జన జీవనం అస్తవ్యస్తమైంది. అయితే గతవారం రోజులుగా వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులకు కాస్త ఉపశమనం లభించనుంది.
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇది రాగల 24గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు.