రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఆంజనేయులు అనే కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విని స్థానికులు వచ్చి చూడగా.. చిన్నారి రక్తస్రావంతో కనిపించింది. ఆగ్రహించిన స్థానికులు ఆంజనేయులుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అధికారులు చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.