గోవా: టాలీవుడ్ యాక్టర్లు రవితేజ-శృతిహాసన్ కాంబోలో క్రాక్ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది.
గోవాలో కొరియోగ్రాఫర్ రాజుసుందరం నేతృత్వంలో రవితేజ-శృతిహాసన్ మధ్య వచ్చే పాటను చిత్రీకరించారు. ఇదిలా గోవాలోని లొకేషన్ లో షూటింగ్ బ్రేక్ టైంలో రవితేజ-శృతిహాసన్ సరదాగా ఫన్నీ వర్కవుట్ చేశారు.
ఒకరిని ఫాలో అవుతూ ప్లాంక్స్ చేశారు. వర్కవుట్ మధ్యలో నవ్వుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
చిత్రయూనిట్ కు ధన్యవాదాలు తెలుపుతూ క్రాక్ షూటింగ్ పూర్తయిందని పోస్ట్ ద్వారా తెలిపింది శృతిహాసన్.
మీ అందమైన కుటుంబంతో కలిసి ఈ సంక్రాంతికి సినిమా చూడండి..అని పోస్ట్ లో పేర్కొంది. ఠాగూర్ మధు సమర్పిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తోంది.