HomeతెలంగాణMynampally: మైనంపల్లిపై తిరుగుబాటు

Mynampally: మైనంపల్లిపై తిరుగుబాటు

– సహకరించని సొంత కేడర్​
– అధిష్ఠానాన్ని విమర్శించడంతో సహాయనిరాకరణ
– ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం
– మూసుకుపోయిన దారులు
– కేటీఆర్ వచ్చినా నో ఇన్విటేషన్​
– దిక్కుతోచని స్థితిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే

Mynampally: ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్​ రావు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. కుమారుడు రోహిత్​ కు టికెట్​ దక్కకపోవడంతో సొంతపార్టీపైనే విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం సొంతపార్టీ కేడర్​ కూడా మైనంపల్లిని పట్టించుకోవడం లేదని సమాచారం. అధిష్ఠానాన్ని విమర్శించడంతో సొంతపార్టీ కార్యకర్తలే ఆయనను పట్టించుకోవడం లేదని టాక్​. బీఆర్ఎస్​ అభ్యర్థులను ప్రకటించిన రోజే మైనంపల్లి తిరుమల వేదికగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. కొడుకుకు టికెట్​ రావడం లేదని తెలిసి రగిలిపోయారు. ఆయన పార్టీ మారబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు బీఆర్ఎస్​ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తనను వేచి చూడమన్నారని.. మైనంపల్లి ప్రకటించారు. ఆ నేత కేటీఆరే​ అని అంతా భావించారు. కేటీఆర్​ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మైనంపల్లిని పిలిపించి మాట్లాడతారని .. వివాదం సద్దుమణుగుతుందని అంతా అనుకున్నారు. కానీ కేటీఆర్​ నుంచి మైనంపల్లికి ఇన్విటేషన్​ రాలేదని సమాచారం. పైగా హరీశ్​ రావుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో సీఎం కేసీఆర్​ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని టాక్​. మొత్తానికి మైనంపల్లి ఏకాకిగా మిగిలిపోయారు.

కాంగ్రెస్​లో చేరుతారా?
నిజానికి మైనంపల్లి తన కుమారుడికి టికెట్​ దక్కలేదనే అసంతృప్తిగా ఉన్నారు. మరి కాంగ్రెస్​ పార్టీలో చేరితే ఆయనకు, ఆయన కుమారుడికి టికెట్​ వస్తుందా? అన్నది అనుమానమే. ఎందుకంటే కాంగ్రెస్​ పార్టీలో ఇప్పటికే కుటుంబానికి ఒకటే టికెట్​ అన్న విధానం ఉంది. ఒక వేళ రూల్స్​ బ్రేక్​ చేసి మైనంపల్లి కుటుంబంలో రెండు టికెట్లు ఇస్తే.. సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అంతేకాక వారంతా తమ వారసులకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరుతారు. కాంగ్రెస్​ పార్టీలోని అనేక కుటుంబాలు తమ వారసులను రాజకీయ రంగంలో దించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఒకవేళ మైనంపల్లికి, ఆయన కుమారుడికి టికెట్​ ఇస్తే.. వారంతా టికెట్లు అడిగే అవకాశం ఉంది. దీంతో మైనంపల్లి కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు కూడా అనుకూల వాతావరణం కూడా లేదు. మరోవైపు మైనంపల్లి గతంలో రేవంత్​రెడ్డి మీద చేసిన కామెంట్స్​ ఇటీవల వైరల్​ అయ్యాయి. దీంతో ఈ కామెంట్స్​ కూడా ఆయనకు నష్టం తెచ్చిపెట్టాయి.

బీజేపీలోనూ మూసుకుపోయిన దారులు..
ఇక బీజేపీలో చేరేందుకు సైతం మైనంపల్లికి దారులు మూసుకుపోయినట్టు సమాచారం. ఆయన గతంలో బండి సంజయ్​ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆయన చేరికను బీజేపీ సీనియర్​ నేత రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీలో ఆయనకు ఆయన కుమారుడికి టికెట్​ ఇచ్చే అవకాశం ఉందా? అన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో మైనంపల్లి రాజకీయ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంలో పడిపోయింది. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? అనేది సస్పెన్స్​ గా మారింది.

Recent

- Advertisment -spot_img