ఇదేనిజం, డోర్నకల్: ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డోర్నకల్ మండలంలో రెండో రోజు శనివారం ఉదయం బూరుగుపాడు దుబ్బ తండా కన్నెగండ్ల గ్రామ పంచాయతీల్లో, ప్రజా పాలన సభలు నిర్వహించారు. తహసీల్దార్ నాగభవాని , ఎంపిడివో చలపతి రావు , బృందాల ఆధ్వర్యంలో గ్రామసభల్లో ప్రజా పాలన ఉద్దేశం, ముఖ్యమంత్రి సందేశం గురించి ప్రజలకు వినిపించారు.