Homeజాతీయందేశంలో రికార్డు స్థాయికి చేరిన‌ క‌రోనా కేసులు

దేశంలో రికార్డు స్థాయికి చేరిన‌ క‌రోనా కేసులు

న్యూఢిల్లీః దేశంలో కరోనా కేసుల సంఖ్య రికార్డులు సృష్టిస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 10,91,251 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 97,570 కేసులు న‌మోదు అయ్యాయి. 1,201 మంది కొత్త‌గా క‌రోనా మహమ్మారికి బలయ్యారు. ఇది ఒక‌రోజు గ‌రిష్ఠ స్థాయి కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 46,59,985కి చేరింది. వీరిలో 9,58,316 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 36,24,196 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 77,472కి చేరుకుంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.77 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.66 శాతంగా ఉంది.

Recent

- Advertisment -spot_img