– సినిమా విడుదల చేయొద్దని హైకోర్టులో పిటిషన్ వేసిన నారా లోకేశ్
– ఈ నెల 28న విచారణ చేపట్టనున్న కోర్టు
ఇదేనిజం, ఏపీబ్యూరో : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ నిలిపివేయాలని, రిలీజ్ నిలిపివేయాలని నారా లోకేశ్ వేసిన పిటిషన్ను హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 28న దీనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. చిత్ర బృందం తరుపున అదే రోజు తమ వాదనలు వినిపిస్తున్న నిర్మాత తరపు న్యాయవాది కోర్టుకు నివేధించారు. మరోవైపు హైద్రాబాద్ల్ని రాంగోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ‘వ్యూహం’ సినిమాను బ్యాన్ చేయాలని నినాదాలు చేస్తూ సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టి నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.