ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రేపు టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల(NDA) ఉమ్మడి మేనిఫెస్టోను కూటమి విడుదల చేయనుంది. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం పేర్లతో తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ప్రధానంగా పెన్షన్పై కూటమి దృష్టి పెడుతున్నట్లు సమాచారం. క్రమంగా పెన్షన్ను పెంచుకుంటూ వెళ్తామని YCP అంటుండగా… తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ. 4వేల పెన్షన్ ఇస్తామని కూటమి హామీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.