ఇదేనిజం, మల్కాజగిరి : సఫిల్గూడ చెరువు కట్టపైన కొద్దిరోజులుగా వీధిదీపాలు సక్రమంగా వెలగడం లేదు. దాంతో పలువురు సీనియర్ సిటిజన్స్, వాకర్స్ మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ దృష్టికి తీసుకువచ్చారు. వీధిదీపాలని పరిశీలించిన కార్పొరేటర్ శ్రవణ్ హెచ్ఎండీఏ అధికారి పద్మతో మాట్లాడి మరమ్మతులు చేయించారు. అదేవిధంగా చెరువుపైన పాడైపోయిన రైయిలింగ్, చెరువు వద్ద సుందరీకరణ పనులను చేపట్టాలని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ కోరారు.