Homeజిల్లా వార్తలుRevanth Reddy : మహాలక్ష్మీ స్కీమ్ షురూ

Revanth Reddy : మహాలక్ష్మీ స్కీమ్ షురూ

– రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ
– ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
– చేయూత స్కీమ్ కింద ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
– 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తమన్న సీఎం

ఇదే నిజం, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే చేయూత పథకాన్ని సీఎం శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ఇవాళ తెలంగాణ ప్రజలకు పండగ రోజు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారు. ఇవాళ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు’అని తెలిపారు. మరోవైపు మహాలక్ష్మీ స్కీమ్ రాష్ట్రవ్యాప్తగా అమల్లోకి రావడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహిళలు, యువతులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

Recent

- Advertisment -spot_img