Homeక్రైంRevanth Reddy : రెసిడెన్షియల్​ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎక్కడివి?

Revanth Reddy : రెసిడెన్షియల్​ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎక్కడివి?

– హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారింది
– పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం
– నాంపల్లి ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి


ఇదే నిజం, హైదరాబాద్: నాంపల్లి బజార్ ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందన్నారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అపార్ట్‌మెంట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కారు రిపేర్ల గ్యారేజ్​ ఉండటం ఏంటని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారని ప్రశ్నించారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ కోరారు.

Recent

- Advertisment -spot_img