HomeSocial MediaBRSకు రేవంత్ సర్కార్ షాక్.. BRS భవన్ కు నోటీసులు

BRSకు రేవంత్ సర్కార్ షాక్.. BRS భవన్ కు నోటీసులు

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ ఇన్ ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి రెవిన్యూ శాఖ నోటీసులు పంపింది. తెలంగాణ భవన్ లో టి న్యూస్ ఛానల్ నిర్వహించడాన్ని ఈ నోటీసులో ప్రశ్నించింది. పార్టీ ఆఫీసులో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం చట్ట సమ్మతం కాదని పేర్కొంది. ఎప్పటిలోగా ఖాళీ చేస్తారో వారం రోజుల్లో తెలియజేయాలని నోటీసులో చెప్పింది. దీంతో రెవిన్యూ శాఖ పంపిన నోటీసును శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో 2011 నుంచి టీవీ ఛానల్ నడుపుతోంది. ఇంతకాలం పార్టీ అధికారంలో ఉండడంతో అధికారులు మౌనాన్ని ఆశ్రయించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం చేజారింది. అనంతరం టీవీ ఛానల్ ను మరో భవనానికి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేయడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు సమాచారం. కాగా, రెవెన్యూ శాఖ నోటీసులపై తెలంగాణ భవన్ వర్గాలు అధికారికంగా స్పందించలేదు.

Recent

- Advertisment -spot_img