HomeSocial Mediaములుగు జిల్లాలో ఘోరప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

ములుగు జిల్లాలో ఘోరప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

ములుగు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తాడ్వాయి మండలంలో నిన్న రాత్రి ఇద్దరు యువకులు పెయింటింగ్ పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పోతుగంటి పవన్, ఎల్తూరి వంశీలుగా గుర్తించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img