టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉదారతపై ఓ సపోర్ట్ స్టాఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 WC గెలిచిన టీమిండియాకు బీసీసీఐ నగదు పంపిణీ చేసే సమయంలో రోహిత్.. సపోర్ట్ స్టాఫ్ కోసం తన రూ.5 కోట్ల బోనస్ను వదులుకునేందుకు సిద్ధమయ్యారట. ‘సపోర్ట్ స్టాఫ్కు అంత తక్కువ డబ్బు రాకూడదు. కావాలంటే నా బోనస్ను వారికి సమంగా పంచండి అని రోహిత్ చెప్పినట్లు తెలిపాడు.