అమెరికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్కు వెళ్లిన భారత ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. పరిస్థితులకు అలవాటు పడి నెట్స్లో చెమటలు కక్కుతున్నారు. జూన్ 2న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్-ఏలో ఉన్న భారత్ గ్రూప్ దశ మ్యాచ్లన్నీ యూఎస్ఏలోనే ఆడనుంది. గ్రూప్-ఎలో భారత్తో పాటు పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 5న ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనున్న రోహిత్ సేన.. రేపు న్యూయార్క్లో బంగ్లాదేశ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ముందుగా ఫీల్డింగ్పై దృష్టి పెట్టాడు. క్యాచ్ కసరత్తులు చేశారు. హాయ్ క్యాచ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ను తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అవేశ్ ఖాన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా దూబేతో రోహిత్ చాలాసేపు మాట్లాడాడు. ఎలాంటి లైన్ అండ్ లెంగ్త్ బంతులు సంధించాలో సూచించాడు. దూబేను చక్కటి ఆల్ రౌండర్గా మార్చేందుకు రోహిత్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. భారత తుది జట్టులో ఫామ్ లో లేని హార్దిక్ పాండ్యా స్థానంలో దూబేకు అవకాశం ఇవ్వాలని రోహిత్ యోచిస్తున్నాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.