సూర్యాపేట జిల్లాలో కొందరు కేటుగాళ్లు గోల్డ్ లోన్ పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడాకు టోకరా వేశారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఏకంగా రూ.53 లక్షల మేర నగదును కొట్టేశారు. దీంతో అప్రమత్తమైన బ్యాంక్ ఆఫ్ బరోడా, రాయనిగూడెం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.