Homeహైదరాబాద్latest Newsపలు రైళ్లు రద్దు కారణంగా కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సు..ప్రయాణికులు ఇబ్బందులు

పలు రైళ్లు రద్దు కారణంగా కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సు..ప్రయాణికులు ఇబ్బందులు

మధిర నుండి ఖమ్మం, విజయవాడ వెళ్లే వారి కోసం రైల్వే సౌకర్యం ఉండడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు అరకురా ఉన్న ఎటువంటి ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కోలేదు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడు లైన్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. దీనితో మధిర నుండి ఖమ్మం, విజయవాడ కు ఉద్యోగ వ్యాపార రీత్యా ప్రయాణించవలసిన ప్రజలకు సరిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయాన్ని గమనించి మధిర డిపో నుండి ఉదయం, సాయంత్రం అదనపు ఆర్టీసీ సర్వీసులను ఖమ్మం విజయవాడకు నడపవలసిందిగా ప్రయాణికులు మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ ను కోరుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం అదనపు ఆర్టీసీ సర్వీసులను నడిపి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img