Homeహైదరాబాద్latest Newsసదరం స్లాట్ బుకింగ్ ఇక నిరంతర ప్రక్రియ: ఎంపీడీవో జి.నరసింహమూర్తి

సదరం స్లాట్ బుకింగ్ ఇక నిరంతర ప్రక్రియ: ఎంపీడీవో జి.నరసింహమూర్తి

ఇదే నిజం, నల్లబెల్లి/నర్సంపేట: ఇక నుండి సదరం స్లాట్ బుకింగ్ అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుందని, అర్హు లైన వారు ఎపుడైనా స్లాట్ బుక్ చేసుకో వచ్చునని ఎంపీడీవో నరసింహమూర్తి అన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో ఎంపీడీవో మాట్లాడుతూ, బుక్ చేసుకోగానే స్లాట్ ఉ న్నచో, స్లాట్ క్యాంపు తేది, వెనూ చూపె డుతుందని, స్లాట్ లేనిచో రిజర్వ్ లో ఉ ంటుందని ఎంపీడీవో తెలిపారు. ఎప్పుడైతే స్లాట్ షెడ్యూల్ ఇస్తారో వారికి దానంతటదే స్లాట్ అలాట్మెంట్ అవుతుందని ఎంపీడీవో నరసింహమూర్తి తెలిపారు.

స్లాట్ బుక్ కాగానే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు డిపార్ట్మెంట్ ద్వారా ఎస్ఎమ్ఎస్ పంప డం జరుగుతుందని, అందులో క్యాంపు మరియు స్లాట్ వివరాలు వారికి తెలియ జేయబడుతుం దని ఆమె అన్నారు. అదేవిధంగా మీసేవ ఆపరేటర్లు, వీఎల్ ఈలు అందరూ సిటిజన్ మొబైల్ నంబర్ను జాగ్రత్తగా సరిచేసి నమోదు చేయగలరని ఎంపీడీవో వారిని కోరారు. ఎడిట్ ఆప్షన్ ను క్యాంపు లాగిన్ నుండి తీసి వేయడం జరిగినదని, అందు కోసం అన్ని వివరాలు స్పెల్లింగ్ మిస్టేక్ లు లేకుండా ఎంట్రీ చేయగలరని. స్లాట్ బుక్ చేసుకుంటున్నావారి ఫోటోను కూడా సరిగా స్కాన్ చేసి అప్ లోడ్ చేయగలరని ఎంపీడీవో నరసింహమూర్తి సూచించారు.

Recent

- Advertisment -spot_img