HomeసినిమాSalaar మరో గేమ్​ ఆఫ్ థ్రోన్స్..

Salaar మరో గేమ్​ ఆఫ్ థ్రోన్స్..

ఇటీవల విడుదలైన యాక్షన్‌ సినిమాలు ‘యానిమల్‌’,‘సలార్‌’ రెండూ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. అయితే ఈ సినిమాల్లో యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా దీనిపై నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్‌ స్పందించారు. ‘ప్రతి సినిమా సెన్సార్‌ బోర్డుకు వెళ్తుంది. వాళ్లు ఇచ్చే సర్టిఫికెట్‌ ఆధారంగా.. సినిమాలో ఎలాంటి కంటెంట్‌ ఉందో ఆడియన్స్‌కు అర్థమవుతుంది. సినిమా ఎలా తీయాలనే విషయంలో దర్శకులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. కథకు అవసరమైనదాన్ని ఎక్కడా రాజీపడకుండా అందించాలి. ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’ హింసాత్మకంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. దాని గురించి ప్రస్తుతం మాట్లాడలేను. ఇక ‘సలార్‌’ విషయానికొస్తే.. కొన్ని సన్నివేశాలు హింసాత్మకంగా ఉన్నాయి. అవి సినిమాకు అవసరం కాబట్టే దర్శకుడు అలా రూపొందించారు. అవి కథను ముందుకు తీసుకెళ్లాయి. వీటికంటే ‘సలార్‌’లో భావోద్వేగాలు ఎక్కువ. అవి అందరి హృదయాలను హత్తుకుంటాయి. అందుకే నేను దీన్ని హలీవుడ్ వెబ్​ సిరీస్ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌తో పోలుస్తాను’అని పృథ్వీరాజ్ అన్నారు. ఇక యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సలార్‌’లో వర‌ద రాజమ‌న్నార్‌గా పృథ్వీరాజ్‌ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదని ప్రశాంత్‌నీల్‌ కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img