ఇండియన్ బాక్సాఫీసు వద్ద సలారోడి కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 22న థియేటర్లలో రిలీజై ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియెన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్గా రూ. 500 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ మరో చిత్రం 500 కోట్ల క్లబ్లో చేరింది. అయితే, ఈ సినిమాకు నేటి నుంచి టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉండటంతో వసూళ్లు మరింత పెరగొచ్చని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.