తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా 14 స్థానాల్లో గెలుస్తామని సోషల్ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెస్ట్, వన్డే మ్యాచ్ల ఫార్మాట్ మారిపోయిందన్నారు. ఇప్పుడు T20 ఫార్మాట్ విజయవంతంగా నడుస్తుందని అన్నారు. సెమీ ఫైనల్లో కేసీఆర్ ను ఓడించామని, ఫైనల్స్లో మోదీని ఓడించబోతున్నామని తెలిపారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, సోషల్ మీడియా వారియర్స్ కూడా ఇప్పుడు మేలుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.