పట్టించుకోని అధికారులు ఇదే నిజం, మెట్ పల్లి రూరల్ : మెట్ పల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి ఇసుక, మొరం విచ్చలవిడిగా మెట్ పల్లి కి తరలిస్తున్నారు. ఈ తరలింపులో మైనర్ డ్రైవర్ లు ఇస్టానుసారంగా రోడ్డుపై ట్రాక్టర్ లు నడపడంతో ప్రమాదాలు జరిగే అవకాశలున్నాయి. ఈ అక్రమ రవాణా నెల రోజుల నుంచీ సాగుతున్నప్పటికి పోలీసులు, రెవిన్యూ సిబ్బంది చూసీ చూడన్నట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కుమ్మక్కయి నిర్లక్ష్యం వహిస్తున్నారని పలు వాదనలు వినిపిస్తున్నాయి.