ప్రజాపాలన దరఖాస్తుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ సర్కారు కీలక ప్రకటన చేసింది. X వేదికగా స్పందిస్తూ.. ‘6 గ్యారంటీల కోసం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక విషయంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ను ప్రభుత్వం వినియోగించుకోవాలనుకుంటుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG)అప్లికేషన్ల పరిశీలిస్తాయని పేర్కొంది. అయితే ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మీ) స్కీం, ఆరోగ్య శ్రీ బీమా పథకం కింద వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే.