Homeహైదరాబాద్latest Newsయువకుడిని హత్య చేసి..ఇన్​స్టాగ్రామ్​లో సెల్ఫీ వీడియో

యువకుడిని హత్య చేసి..ఇన్​స్టాగ్రామ్​లో సెల్ఫీ వీడియో

– ప్రగతినగర్​లో దారుణం
– ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని ప్రగతినగర్​లో జరిగింది. ఎస్‌ఆర్​నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్‌ (21) అలియాస్‌ సిద్ధూ.. గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లి రెండు నెలల క్రితం విడుదలయ్యాడు. ప్రస్తుతం ప్రగతినగర్‌లోని అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సిద్ధూ తల్లి ఊరు వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న తేజస్‌.. తన మిత్రులైన మహేశ్‌, శివప్ప, సమీర్‌తో కలిసి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రగతినగర్‌లోని బతుకమ్మ ఘాట్‌ ఎదురుగా నిలబడి ఉండగా.. గతంలో హత్యకు గురైన తరుణ్‌ స్నేహితులు సుమారు 20 మంది బైక్​లపై వచ్చి తేజస్‌ను కత్తులతో పొడిచి చంపారు. హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తరుణ్‌ హత్యకు ప్రతీకారంగా తమ పగ నెరవేర్చుకున్నామంటూ నిందితులు ఆ పోస్టులో పేర్కొన్నారు. ఘటనాస్థలాన్ని కూకట్‌పల్లి ఏసీపీ కె. శ్రీనివాసరావు, బాచుపల్లి సీఐ జె.ఉపేందర్‌యాదవ్‌ పరిశీలించారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img