Homeహైదరాబాద్latest NewsYCP లో చేరిన సీనియర్​ IAS​ అధికారి

YCP లో చేరిన సీనియర్​ IAS​ అధికారి

ఇటీవలే స్వచ్చంద పదవీ విరమణ చేసిన సీనియర్​ IAS​ అధికారి ఏఎండీ ఇంతియాజ్​ తాజాగా YCP లో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి జగన్​ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గతంలో ఆయన సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంతియాజ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేడు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో YSRCP రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, కర్నూలు మేయర్‌ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img