Homeహైదరాబాద్latest NewsCrime News : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

Crime News : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

– స్కూటీని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
– భార్య మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

ఇదేనిజం ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మజివాడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భార్యభర్తలు స్కూటీ మీద వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో భార్య మృతి చెందగా.. భర్త తీవ్ర గాయాలయ్యాయి. సదాశివనగర్ కు చెందిన ఏనుగు జనార్దన్ రెడ్డి (49), అతని భార్య ప్రతిభ (42) పద్మాజీవాడి గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు స్కూటీ పై వెళ్తుండగా పద్మాజివాడి యూటర్న్ వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

Recent

- Advertisment -spot_img