ఈ ఏడాది జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ తరఫున క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే, హసీనా ప్రభుత్వం రద్దవడంతో షకీబ్ పదవిని కోల్పోయాడు. దీంతో టెస్టు క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని ఆ దేశ క్రికెట్ బోర్డును కోరాడు. ఇందుకు బంగ్లా క్రికెట్ బోర్డు అంగీకరించింది.