హైదరాబాద్ః శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కిస్తున్న శ్రీకారం సినిమాలో ‘భలేగుంది బాల’ పాట రిలీజ్ అయి దుమ్ము రేపుతోంది.
పెంచల్ దాస్ స్వయంగా రాసి కంపోజ్ చేసి తనే పాడాడు. భలేగుంది బాలా అంటూ అలా విడుదలైందో లేదో ఇలా యూ ట్యూబ్ లో ట్రెండింగ్లోకి వచ్చేసింది.
నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్. ఆమె నడుము అందాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వ్యవసాయం నేపథ్యంలో సాగే ‘శ్రీకారం’ సినిమాను కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.