సాధారణంగా రోడ్డు మీద డబ్బులో, విలువైన వస్తువులో పడిపోతే వాటిని చటుక్కున అందుకొనే బ్యాచ్ కొందరైతే.. ఆ డబ్బును పోలీస్ స్టేషన్ లో అప్పగించే నిజాయితీ పరులూ ఉంటారు. అయితే తాజాగా ఓ మహిళకు రూ. లక్ష రూపాయిలు దొరికాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆర్టీసీ బస్సు డిపో వద్ద ఓ వ్యక్తి బస్సు దిగుతుండగా.. అతడి వద్ద ఉన్న లక్ష రూపాయల నోట్ల కట్ట కింద పడిపోయింది. అది గమనించుకోకుండా అతడు వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న మహిళ అదే అదునుగా డబ్బు కట్ట చూసి వాటిని తీసుకుని.. భద్రంగా దాచుకుని.. చకచకా వేగంగా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది ఇదంతా సీసీటీవీ కెమరాలో దొరికిన ఫుటేజ్ ఆధారంగా బైట పడింది. జరిగిందట రికార్డ్ కావడంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వీడియో చూసిన నెటిజనులు.. అక్కో నువ్వు మామాలుదానివి కాదు కదా.. నిమిషాల్లో లక్ష నొక్కేసావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాపం డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు ఎంత బాధపడతారో మీకు అర్థం కాలేదా.. అలా ఎలా చేస్తారు.. ఆ డబ్బును పోలీసులకు అప్పగించాలి కదా! అని కామెంట్స్ చేస్తున్నారు.