తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలా గత 24 గంటల్లోనే హైదరాబాద్ నగరంలో ఐదు హత్యలు, రెండు హత్యాయత్నాలు చోటుచేసుకున్నాయి. ఇలా ఒక్క రోజులోనే ఐదుగురు హత్యకు గురికావడంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు.