టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’(DJ Tillu) సినిమాకు సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే. ‘టిల్లు స్వ్కేర్’ పేరుతో వస్తున్న ఈ సీక్వెల్లో సిద్ధూకు జోడిగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. మార్చి 29న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. అయితే, ‘టిల్లు స్క్వేర్’పై ఆడియెన్స్లో భారీ అంచనాలున్నాయి. వీటిపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో సిద్ధూ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్కు కొన్ని పాత పరిస్థితుల్లోనే ఉంటుంది. కానీ కొత్త పరిస్థితులు, కొత్త అమ్మాయి, ఇంకా మరికొన్ని కొత్త పాత్రలు ఇందులో పరిచయమవుతాయి. అలాగే సర్ప్రైజ్లు ఉండవు. కానీ గత సినిమా వైబ్ అలాగే ఉంటుంది.’అని క్లారిటీ ఇచ్చాడు. రామ్ మల్లిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.