Homeతెలంగాణయథావిధిగా సింగరేణి ఎన్నికలు

యథావిధిగా సింగరేణి ఎన్నికలు

– 27న జరగనున్న ఎన్నికలు
– వాయిదా వేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆ సంస్థ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సింగరేణి ఎన్నికలు ఈ నెల 27న యధావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సింగరేణి హైకోర్టును ఆశ్రయించింది. వాయిదా వేయాలని హైకోర్టులో సింగరేణి కంపెనీ మధ్యంతర పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎన్నికలు వాయిదా వేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది.

Recent

- Advertisment -spot_img