Homeహైదరాబాద్latest Newsగ్రామాల్లో కుటుంబాలను పరామర్శించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

గ్రామాల్లో కుటుంబాలను పరామర్శించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

ఇదే నిజం, ముస్తాబాద్: మండలంలోని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పలు గ్రామాల్లో కుటుంబాలను పరామర్శ చిప్పలపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జంగబాపు రెడ్డి గారు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. మరియు చికోడు గ్రామానికి చెందిన గన్నాల పరుశరాములు గౌడ్ గారి మాతృమూర్తి అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అలాగే పోతుగల్ గ్రామంలో మౌత్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నల్ల చారిని పరామర్శించి అలాగే వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గజ్జల రాజు, చర్లపల్లి శ్రీనివాస్, ఉచిడి బాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, తోట ధర్మేందర్, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img