Homeహైదరాబాద్latest Newsరేపే ఆరోదశ పోలింగ్

రేపే ఆరోదశ పోలింగ్

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడత ఎన్నికలు రేపు ( మే 25) జరగనున్నాయి. పోలింగ్​ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపింది. ఆరో విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే హరియాణాలోని 10, దిల్లీలోని 7 సీట్లకూ ఎన్నిక జరగనుంది.

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా, కనెక్టివిటీకి సంబంధించిన లాజిస్టికల్, కమ్యూనికేషన్ వంటి అడ్డంకులు తలెత్తాయి. దీంతో మే 25న ఆరో విడతలో ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.

Recent

- Advertisment -spot_img