HomeSocial MediaMHBD: శాతవాహన ఎక్స్ ప్రెస్ లో పొగలు.. ఒక్కసారిగా పరుగులు తీసిన ప్రయాణికులు

MHBD: శాతవాహన ఎక్స్ ప్రెస్ లో పొగలు.. ఒక్కసారిగా పరుగులు తీసిన ప్రయాణికులు

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ నాంపల్లిలో ట్రైన్ పట్టాలు తప్పి పది మందికి గాయాలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న శాతావాహన ఎక్స్ ప్రెస్ లో పొగలు వచ్చాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయానికి గురై పరుగుల తీశారు.

ట్రైన్ లోని కొందరు ప్రయాణికులు సేఫ్టీ చైన్ ను లాగగా ట్రైన్ అక్కడే ఆగిపోయింది. ప్రయాణికుల సమాచారం మేరకు అధికారులు అక్కడకు వచ్చారు. బ్రేక్ లైనర్ల నుంచి పొగలు రావడం అధికారులు గమనించారు. ప్రయాణికులు భయపడాల్సిన పని లేదని సూచించారు. పొగలను అదుపు చేస్తున్నారని ప్రయాణికులకు అప్రమత్తం చేశారు. రైలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనతో రైలు దాదాపు 15 నిమిషాల పాటు అక్కడే నిలిచిపోయింది. రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది బ్రేక్ లైనర్లను సరిచేయడంతో రైలు అక్కడి నుంచి కదిలింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img