భారతదేశంలో ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫారమ్ టెలిగ్రామ్ స్తంభింపజేయబడింది. టెలిగ్రామ్ డౌన్ అయిన తర్వాత.. దేశవ్యాప్తంగా ప్రజలు సందేశాలు పంపడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 1.07 గంటల తర్వాత ఈ సమస్య తలెత్తింది. ఇక శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలోనూ టెలిగ్రామ్ స్తంభించినట్లు యూజర్లు ఫిర్యాదులు చేశారు. కొందరు లాగిన్ కూడా చేయలేకపోయారు. 24 గంటల్లో 2 సార్లు ఇలా అయిందని పేర్కొంటున్నారు.