– కాంగ్రెస్ పీఏసీ కమిటీ ఏకగ్రీవ తీర్మానం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందని పీఏసీ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 5 అంశాల ఎజెండాలో భాగంగా సోమవారం గాంధీభవన్లో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలపై భేటీలో చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన ఏఐసీసీ నేతలకు పీఏసీ ధన్యవాదాలు తెలిపింది. గ్రామసభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందిచేలా చర్యలు తీసుకుంటామని, వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని పీఏసీ వెల్లడించింది.