Homeజిల్లా వార్తలుతాళ్లకొత్తపేటలో ప్రజా పాలన కార్యక్రమనికి విశేష స్పందన

తాళ్లకొత్తపేటలో ప్రజా పాలన కార్యక్రమనికి విశేష స్పందన

ఇదేనిజం, ధర్మపురి: వెల్గటూర్ మండలం తాళ్ల కొత్తపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ద్యావనపల్లి లక్ష్మీ, ఎల్లయ్య శనివారం ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకున్నట్లు గ్రామ పంచాయతీ సెక్రెటరీ మహేందర్ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బత్తుల భూమయ్య, ఉప సర్పంచ్ దర్మాజి సతీష్, ఎంపీటీసీ రంగు తిరుపతి, వార్డ్ సభ్యులు, కోల లచయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు ద్యవనపెల్లి సుధాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుపతి,వైద్య సిబ్బంది సభ్యులు, ఎం.ఎల్.హెచ్.పి మౌనిక, ఏఎన్ఎం బుజ్జమ్మ, లక్ష్మి, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, గ్రామ యువకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img