Homeక్రైంఆ ఎమ్మెల్యే పీఏ SUICIDE

ఆ ఎమ్మెల్యే పీఏ SUICIDE

ఇదేనిజం, ఏపీ బ్యూరో: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ రవి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​ రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న రవి శ్రీకాళహస్తిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న రవి.. ఎమ్మెల్యే తరఫున వచ్చే వీఐపీలకు తిరుమలలో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించేవాడు. అయితే ఉన్నట్టుండి రవి ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణమని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img