దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 75.71 పాయింట్లు లాభపడి 73,885.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 42.05 పాయింట్ల లాభంతో 22,530.70 వద్ద ముగిసింది. టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడగా.. నెస్లే ఇండియా, టీసీఎస్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.