దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎన్టీపీసీ, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ఫార్మా, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.