అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 192 పాయింట్లు పెరిగి 77,185 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకొని 23,522 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్లో విప్రో, ఇన్ఫోసిస్, టైటన్, హెచ్యూఎల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, టీసీఎస్, HDFC బ్యాంక్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.