శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 22,962 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్లో ఎన్టీపీసీ, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మారుతీ, టీసీఎస్, పవర్గ్రిడ్, ఐటీసీ, రిలయన్స్ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.