Homeహైదరాబాద్latest Newsరోడ్డుపై చేరిన మురికినీరు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

రోడ్డుపై చేరిన మురికినీరు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి పట్టణంలోని రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు పై మురికి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్ పల్లి మండలంతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు మరియు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లాలంటే ఈ మార్గం గుండె వెళ్లాలి. పట్టణంలోని మురికి కాలువ నీరు రోడ్డుపై చేరడంతో వాహనదారులు దుర్వసన తో పాటు కారు లేదా బస్సు లాంటి వాహనాల వల్ల మురికి నీరు చిల్లడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కావున అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img