మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దోరగారిపల్లేలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజశ్విని తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్ట్మార్టం నిమిత్తం తేజశ్విని మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.