Homeహైదరాబాద్latest Newsతాగొస్తే మందలించారు...ఆత్మహత్యకు పాల్పడ్డాడు

తాగొస్తే మందలించారు…ఆత్మహత్యకు పాల్పడ్డాడు

ఇదే నిజం, కోరుట్ల టౌన్ : జగిత్యాల జిల్లాలో కోరుట్ల అల్లమయ్య గుట్టకు చెందిన వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరనికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మోటం సాయిలు (58) అనే వ్యక్తి మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. కుటుంబసభ్యులు మందలించగా మనస్థాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందున్న రేకుల షెడ్డులో ఇనుప రాడ్ కు చీర తో ఊరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు మధు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img